38.2 C
Hyderabad
May 3, 2024 19: 14 PM
Slider సినిమా

దయచేసి మనిషికి మూడు చెట్లు నాటండి

ali green

నేడు గ్రీన్ ఛాలెంజ్ లో ప్రఖ్యాత హాస్యనటులు అలీ, కృష్ణ భగవాన్, రఘు బాబు పాల్గొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నె 12 లో ఉన్నపార్కులో వీరు ముగ్గురు మూడేసి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కాదంబరి కిరణ్  ఆధ్వర్యంలో వీరు ఈ కార్యక్రమం చేపట్టారు.

ప్రతి వ్యక్తి 3 మొక్కలు నాటి తిరిగి  మరో ముగ్గురికి గ్రీన్  ఛాలెంజ్ విసరాలని వారు పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్  కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వారు కోరారు. మొక్కలను నాటాలనే ముఖ్యమంత్రి కెసీఆర్ హరిత హారం సంకల్పానికి తన వంతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా వున్నది, ఇఫ్పటికి కోట్ల మొక్కలకు పైగా చేరుకోవడం గర్వకారణంమని వారన్నారు.

మనిషి తనను తాను రక్షించుకోవాలంటే ప్రకృతిని రక్షించాల్సిందేననే మహోన్నత లక్ష్యంలో భాగంగా,  సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చారని,  నటులను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి, తమ అభిమానులకు స్పూర్తిగా నిలవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని, వనాలను పెంచడం అనే కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో సంతృప్తినిచ్చింది అని వారు తెలిపారు.

Related posts

గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌కు జిల్లా ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ “క్లాసు”….!

Satyam NEWS

నాలుగు వేల మ‌ద్యం  బాటిళ్లు రోడ్ రోల‌ర్ తో ధ్వంసం…!

Satyam NEWS

మంత్రి పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు

Satyam NEWS

Leave a Comment