38.2 C
Hyderabad
May 5, 2024 20: 28 PM
Slider ముఖ్యంశాలు

మంత్రి పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు

#peddireddy

వైసీపీ మంత్రులకు బ్యాడ్ టైమ్ స్టార్ అయినట్లు కనిపిస్తున్నది. ఇంత కాలం పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన సాగించిన వైసీపీ నేతలకు ఇప్పుడు కష్టకాలం దాపురించింది. జడ్జి రామ కృష్ణ ఫిర్యాదు నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై క్రిమినల్ చర్యలకు చిత్తూరు జిల్లా కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జడ్జి రామ కృష్ణ న్యాయ పోరాటం చేశారు. చిత్తూరు జిల్లా జడ్జి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ (క్రిమినల్ కేసు) దాఖలు చేశారు. చివరకు జడ్జి రామ కృష్ణ చేసిన పోరాటం ఫలించింది. Under Sec. 3(1) (r) (s) and Sec. 3(2) (VII) of SC ST (POA), 1989 and Sec. 379, 380, 500 and 506 IPC కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. B.కొత్తకోట పోలీస్ స్టేషన్ కు చిత్తూరు జిల్లా జడ్జి ఈ మేరకు ఆదేశాల జారీ చేశారు.

Related posts

డిగ్రీ చదివే అనూషను దారుణంగా హతమార్చారు

Satyam NEWS

ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

జూనియర్ పుట్టిన రోజున పేదలకు ఎగ్ బిరియాని

Satyam NEWS

Leave a Comment