నెల రోజులుగా గడపగడప కార్యక్రమంలో పాల్గొంటున్నా ఎక్కడ ఆసంతృప్తి వ్యక్తం కాలేదని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 17 డివిజన్లోని వడ్డీ పాలెం రామాలయం వీధిలో శనివారం సాయంత్రం గడపగడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పట్ల అన్నిచోట్ల సంతృప్తి వ్యక్తం అవుతోందని తెలిపారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పై కూడా సంతృప్తి వ్యక్తం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుధాకర్, వైసిపి సీనియర్ నేత పాముల రమణయ్య, నేతలు పాముల హరిప్రసాద్, పాశం శ్రీనివాసులు, డాక్టర్ సునీల్, స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, హరిబాబు యాదవ్, సుబ్బారెడ్డి, దేవి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జెడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.