ప్రపంచ వ్యాప్తంగా “అయోధ్య”లో రాములోరి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది. తన, పర అన్న బేధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా సన్నద్దమవుతోంది. అలాగే పార్టీల పరంగా అందరూ తయారవుతున్నారు. అందులో భాగంగా ఏపీ రాష్ఠ్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్యర్యంలో ఈ మేరకు ఆయన నివాసం లో ఆయన బిడ్డ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తో కార్పొరేటర్లు, వైఎస్ ఆర్సిపీ నేతలు హాజరై…. ఈ నెల 22వ తేదిన ఆ మహోత్తర కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేందుకు దాన్ని తిలకించేందుకు నగర ప్రజలంతా సమాత్తం అవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అదే రోజు గురజాడ కళాభారతిలో ఆ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అందరూ హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ ప్లోర్ లీడర్ రాజేష్, ఆశపు వేణు, మేయర్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post