39.2 C
Hyderabad
May 3, 2024 12: 24 PM
Slider ముఖ్యంశాలు

అన్ని ఏర్పాట్లు పూర్తి

#vikasraj

మునుగోడు ఉప ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మునుగోడు లో 2.41 లక్షల మంది  ఓటర్లు ఉండగా అందుకు అనుగుణంగా  పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని పోలింగ్ బూత్ లలో వెబ్ కాస్టింగ్ పెట్టామని , ఈసారి ఐటీ టీమ్స్ తిరుగుతున్నాయని పేర్కొన్నారు. నవంబర్ 3 వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం  6 గంటల వరకు  పొలింగ్ జరుగుతుందన్నారు. రంగంలోకి ఫ్లయింగ్ స్క్యాడ్ తో సహా 51 టీమ్స్ ఏర్పాటు జరిగిందన్నారు.   3,366 మంది  స్టేట్ పోలీస్ 15 కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్ బందోబస్తు లో వుంటాయన్నారు. మొత్తం 5536 పోస్టల్ ఓట్స్ లో 739 మంది   మాత్రమే పోస్టల్ బ్యాలెట్స్ కి అప్లయ్ చేసుకున్నారన్నారు. 1వ తేదీ  సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం సమయం వున్నదని, ఎన్నికలకు సంబంధించి బల్క్ మెసేజెస్ పంపకుడదన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవన్నారు.

Related posts

నితిష్ కుమార్ కు మరో ఎదురు దెబ్బ

Satyam NEWS

బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

Satyam NEWS

వైసీపీ మహిళా నేత నుంచి రూ. 44 లక్షల దొంగ నోట్ల స్వాధీనం

Bhavani

Leave a Comment