కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NRC CAB బిల్లును వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్ళెం లో ముస్లింలు నిరసనకు దిగారు. చెన్నై నుంచి తిరుపతికి వెళుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బిజేపి ప్రభుత్వం ప్రాంతీయ మత విద్వేషాలను రచ్చగొడుతుందన్నారు.
బ్రిటీష్ కాలం నుంచి హిందువులు, ముస్లింలు సోదరులుగా ఉండి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని ఆయన అన్నారు. మహాత్మ గాంధీ, ఇందీరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యల కేసులో ముస్లింలు ఉన్నారా అని నారాయణ ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళలో ముస్లింలు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఏ విధంగా ముస్లింలను దేశ ద్రోహులుగా పరిగణిస్తారని బిజేపి అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించారు.