30.7 C
Hyderabad
April 29, 2024 03: 37 AM
Slider ఖమ్మం

దేశ ఐక్యతపై ప్రతిజ్ఞ

#khammamdc

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని  జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, జిల్లా అధికారులతో కలిసి దేశ ఐక్యతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగాంచారని, ఆయన పుట్టినరోజు జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకోవడము జరుగుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయనని కలెక్టర్ అన్నారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్,  జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వివరాలు ఉత్తర్వులు తప్పక పాటించాలి

Satyam NEWS

సినీ హీరోలకు వ్యతిరేకంగా అమరావతి రైతుల ధర్నా

Satyam NEWS

వైఎస్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

Satyam NEWS

Leave a Comment