తెలంగాణలో భవిష్యత్ తరాల బ్రతుకుల కోసం వైయస్ షర్మిల కు అండగా ఉందామని వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి అన్నారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి జరుగుతున్న మహా ప్రస్థాన పాదయాత్రలో బుధవారం రోజు హుజూర్ నగర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు షర్మిల సమక్షంలో నాగారం మండలం వద్ద 500 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిన సమీపంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేర్పించారు.పార్టీలో చేరిన కార్యకర్తలను షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాట తప్పని మహానేత దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్ షర్మిల నాయకత్వాన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పడటం తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప వరమని అన్నారు.అన్ని వర్గాల ప్రజలు,నిరుద్యోగులు,యువత,కార్మికులు,కర్షకులు,నిరుపేదలు బాగుపడాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల కే సాధ్యం అన్నారు.
సంక్షేమం,స్వయం సమృద్ధి,సమానత్వం సాధించే దిశగా నీతి గల పరిపాలన కోసం ప్రతి ఒక్కరు వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరి తెలంగాణలో భవిష్యత్ తరాల బ్రతుకుల కోసం వైయస్ షర్మిల ఊ అండగా ఉందామని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్