హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు కష్టకాలం వచ్చింది. ఇటీవల జర్నలిస్టు మనోజ్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. మనోజ్ మరణించిన తర్వాత హైదరాబాద్ లోని జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో మొత్తం 23 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. హైదరాబాద్ లో మొత్తం 140 మంది జర్నలిస్టులకు ఇప్పటి వరకూ కరోనా టెస్టులు నిర్వహించారు. మరి కొంత మందికి కరోనా టెస్టు నిర్వహించాల్సి ఉంది.