28.7 C
Hyderabad
April 28, 2024 06: 59 AM
Slider జాతీయం

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​, డీజిల్​పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్​ ధర రూ.93.07కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్​, డీజిల్​ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్​ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఆంధ్రప్రదేశ్​లో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూరు లో లీటర్​ పెట్రోల్​ రూ.117.32, డీజిల్ రూ.103.10కి చేరింది. హైదరాబాద్​లో పెరిగిన ధరల అనంతరం లీటర్​ పెట్రోల్​ రూ.115.42, డీజిల్​ రూ.101.58గా ఉంది.

Related posts

తెలంగాణలో త్వరలో నార్కోటిక్స్ స్పెషల్ వింగ్

Bhavani

వనపర్తిలో ఘనంగా వాసవిమాత ఆత్మార్పణ వేడుకలు

Satyam NEWS

ఇంత పెద్ద మొత్తం అప్పు ఎలా తీరుస్తావో చెప్పు జగన్

Satyam NEWS

Leave a Comment