28.7 C
Hyderabad
May 6, 2024 02: 58 AM
Slider కరీంనగర్

మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

#gangula

సర్వ మతాల వేదిక తెలంగాణ అని, మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీటవేస్తుందనీ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ  మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని భగత్ నగర్ లో కరీంనగర్ టౌన్ బిఆర్ఎస్ మైనార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబించారు. మేయర్ సునీల్ రావు… పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ లతో కలిసి మొదట బిఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించి..అనంతరం కార్యాలయాన్ని ప్రారంబించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మీర్ శౌకత్ అలీ, నాయకులు మతిన్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బిఆర్ఎస్ లో చేరగా… వారికి గులాబీ కండువ కప్పిన మంత్రి గంగుల… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే MIM కు చెందిన నేత సలీం చేరగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇటీవలే ఎన్నికైన మెకానిక్స్ అసోసియేషన్… రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యవర్గాలను ఘనంగా సన్మానించి… అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ నేడు సురక్షితంగా ఉందంటే కారణం శాంతి భద్రతల పరిరక్షణ అని, అన్ని మతాల పండుగలను, వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రాధాన్యతను ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు.

తెలంగాణలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి కొనసాగుతుందని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం  కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కరీంనగర్ లో మతాల మధ్య ఘర్షణ పెట్టి కొంతమంది రాజకీయం చేయాలని చూశారని, కాని అలాంటి కుట్రలను తిప్పి కొట్టమన్నారు. దేవుడికి తప్ప ఎవరికి భయపడొద్దన్న మంత్రి గంగుల… తెలంగాణలోనే కరీంనగర్ ను అభివృద్దిపథంలో తీసుకువెళ్తున్నామన్నారు. తెలంగాణలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుంది

సిఎం కెసిఆర్ సహకారంతో నగరానికి పెద్ద ఎత్తున నిధులను తీసుక వచ్చామని.. దీంతో కరీంనగర్ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత 2వ నగరంగా అవతరించిందన్నారు. మీ సహాకారంతో మరింత అభివృద్ది చేస్తామన్న మంత్రి గంగుల… జూన్ 21వ తేదీన దక్షిణ భారతదేశంలోనే మొదడి కేబుల్ బ్రిడ్జీని మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంబించుకుంటున్నా మన్నారు. ఈ కేబుల్ బ్రిడ్జీకి డైనమిక్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందన్నారు.

అగష్టు 15వ తేదీన మానేర్ రివర్ ఫ్రంట్ మొదటి దశను ప్రారంభించుకుని… ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది… కరీంనగర్ షాన్ పెంచుతామన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాల్లో తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని… కొన్ని రాష్ట్రాల్లో కరెంట్ కూడా లేదన్నారు. కానీ సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో… తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. నేను ఓట్ల కోసం మాట్లాడడం లేదన్న మంత్రి గంగుల… నగరాన్ని అబివృద్ది చేయాలనే ధ్యేయంతో పనిచేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు మీర్ షౌకథ్ అలి,   ప్రధాన కార్యదర్శి సయ్యద్ వాజీద్, యువజన విభాగం నగర అధ్యక్షుడు దీకొండ కుల్దీప్ వర్మ, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అంజద్ అలి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు శాబీర్, మండల కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జమీలోద్దిన్, డివిజన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆరుగాలం కష్టించిన అన్నదాత ప్రతిఫలంపై మొద్దునిద్రలో కేంద్రం

Satyam NEWS

పాము కాటుకు ఆదివాసీ గిరిజన మహిళ మృతి

Satyam NEWS

ఢిల్లీ ఫలితాల ప్రభావం పౌరసత్వ చట్టంపై ఉండదు

Satyam NEWS

Leave a Comment