పాము కాటుకు గురై ఆదివాసీ గిరిజన మహిళ మృతి చెందింది. సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఏజెన్సీ గ్రామ పంచాయతీ అయినా బంధాల గ్రామ పంచాయతీ పరిధిలో గల బొల్లెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించి గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఏజెన్సీ గ్రామమైన బొల్లెపల్లి గ్రామానికి చెందిన మల్లెల లింగమ్మ (51) రోజులాగే పొలానికి వెళ్లింది.
అక్కడ పనులు చేస్తుండగా పాము కాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో బొల్లేపల్లి, బంధాల, అల్లిగూడెం, నర్సాపూర్ (పిఎల్) గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెకు భర్త మల్లెల ముయన్న, ఇద్దరు కూతుళ్లు శాంత, కరణ, కుమారుడు బాబురావు లు ఉన్నారు.