33.7 C
Hyderabad
April 28, 2024 23: 05 PM
Slider ఖమ్మం

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్ ఇది..

#khammam

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఖమ్మంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.

ఈ మేరకు 17 వ తేదీ రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా తదితరులు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరుతారు.

నేరుగా సీఎం కేసీఆర్‌ తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్‌ చేరుకొని, రాష్ట్రంలో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఖమ్మం సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్‌ ఉంటుంది. మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభావేదిక ముందు ఆసీనులవుతారు. సీఎం కేసీఆర్‌ తో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు. 18వ తేదీ మ. 2 నుంచి సా. 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.

Related posts

ప్రధానిపై అసభ్య పోస్టులు పెట్టిన అటవీశాఖ అధికారి

Satyam NEWS

పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి ఆయుధ పూజ

Satyam NEWS

సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

Satyam NEWS

Leave a Comment