అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఈనెల 13న ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి తెలిపారు.
అన్నమయ్య రాజంపేట అఫీషియల్ క్లబ్ ఆవరణంలో గురువారం మీడియా సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భీమవరం లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు.
ఆయన స్ఫూర్తి తో రాజంపేట లో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో జూనియర్ కాలేజి క్రీడా మైదానం నుంచి భారీ ఎత్తున, ఘనంగా వేలాది భారీ ర్యాలీ గా అల్లూరి విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ బహిరంగ సభ లో స్వాతంత్ర సమర యోధుల నివాళులు అర్పించి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలియజేశారు.
ప్రతిఒక్కరు ఎక్కడి కక్కడే జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు దండు గోపి,దాసరి పెంచాలయ్య తదితరులు పాల్గొన్నారు.