ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చిత్ర విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా లింగరాయపాలెం సమీపంలోని రోడ్డు మాయం అయింది. అదీ ఎక్కడూ మారుమాల కాదు సీఆర్డీయే (CRDA) కార్యాలయ భవనం ముందున్న రోడ్డును ఎవరో తవ్వి తీసుకువెళ్లారు.
రాజధాని అమరావతిలోని రోడ్లను తవ్వి తీసుకువెళ్లడం ఇది కొత్త కాదు. రోడ్లను తవ్వేసి మెటల్ను లారీలతో తరలించుకుపోతున్నా.. సీఆర్డీయే అధికారులు, పోలీసులు పట్టించుకోవడంలేదు. రోడ్డు నిర్మాణం కోసం వేసిన రోడ్పై పరచిన మెటల్ను రాత్రికి రాత్రే దుండగులు దొంగిలించుకుపోయారు.
రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు దొంగతనాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు కోరుతున్నారు.