విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో ఇటుకల బట్టీ వాయు కాలుష్యం పై స్థానికులు సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఇటుకల బట్టీలను ఏర్పాటు చేసుకొని కొంతమంది వ్యక్తులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు.
ఇటుకలు తయారు చేసే క్రమంలో విపరీతమైన పొగరావడం వల్ల స్థానికులంతా వ్యాధిగ్రస్తులు అవుతున్నారని పేర్కొన్నారు ఈ పోగ రసాయన బూడిద వలన శ్వాస కోస వ్యాధులు ప్రబలుతున్నాయని ఆ గ్రామానికి చెందిన ములపర్తి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇటుక బట్టి వ్యాపారం ను నిరోధించాలని స్పందనలో ఫిర్యాదు చేశారు.
ఈ కాలుష్యం వల్ల మామిడి, జీడి మామిడి తోటలు కూడా పింజె దశ లోనే నిర్వీర్యం అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.