రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల మహానాడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి బాబురావు అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం,బడుగు జీవుల రక్షణ కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిపేలా వ్యవస్థలు, ప్రభుత్వాలు పని చెయ్యాలని అన్నారు. కొన్ని ప్రభుత్వాల కారణంగా వ్యవస్థలపై దాడులు జరుగుతుంటే మళ్లీ వాటిని రక్షించేది కూడా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే అని,నేను మీ చేతికి పదునైన కత్తిని ఇవ్వడం లేదు, అన్నిటికంటే శక్తివంతమైన ఓటు అనే ఆయుధం ఇస్తున్నాను అని ఆనాడే అంబేద్కర్ చెప్పిన మాటను గుర్తు చేశారు.
అంబేద్కర్ మహానీయుని జీవితాన్ని రేపటి తరాలు అధ్యయనం చేయాలన్న ఆలోచనతోనే అంబేద్కర్ స్మృతివనానికి దళితుల ఆత్మగౌరవం నిలిపేది వారి జీవితాల్లో వెలుగులు నింపేది మాత్రమే అని,బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సమసమాజ స్థాపనకు పునరంకితం అవుదామని పిలుపు ఇచ్చారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్