31.2 C
Hyderabad
May 3, 2024 02: 43 AM
Slider కర్నూలు

మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి

#Ambedkar Jayanti

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈరోజు నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఈరోజు కర్నూల్లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కమిషన్ సభ్యులు జ్యుడీషియల్ దండే సుబ్రహ్మణ్యం అంజలి ఘటించారు అనంతరం కమిషన్ సభ్యులు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలు ఘటించారు.

ఈ సందర్భంగా గౌరవ కమిషన్ లోని చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్పతనాన్ని కొనియాడారు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకొని విజయాన్ని సాధించడంలో అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కొనియాడారు అదేవిధంగా అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో నీ ప్రాథమిక హక్కులు ఎంతో గొప్పవని హక్కులు కోరుకునేవారు బాధ్యతలను కూడా గుర్తు ఎరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి సంపర రమణమూర్తి పి ఆర్ ఓ కోనేటి రవికుమార్ విభాగాధికారులు జి సునీత బొగ్గరం తారక నరసింహ కుమార్ కమిషన్ సిబ్బంది పోలీస్ ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేను క్షేమంగా ఉన్నా ఆందోళన చెందవద్దు

Satyam NEWS

డ్వాక్రా వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం

Satyam NEWS

పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment