గన్ మెన్ కు కరోనా సోకడంతో ఎమ్మెల్యే రోజా ఎలా ఉన్నారో అని ఆమె అభిమానులు ఆందోళన చెందారు. దీనికి ఆమె క్లారిఫికేషన్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు.
గత 20 రోజులుగా ఆయన డ్యూటీకి హాజరుకాలేదు. మరోవైపు, తన గన్ మెన్ కు కరోనా అని తెలిసిన వెంటనే నగరిలోని తన నివాసంలో రోజా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాను, తన కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రోజా అన్నారు.