ప్రముఖ సంఘ సేవకులు అంబర్ పేట్ శంకర్ ముదిరాజ్ పేదలకు బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడం కోసం ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రామంతపూర్ రవీంద్ర నగర్ కాలనీలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్, సంఘ సేవకులు బస్వరాజ్ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆవుల గడ్డ శ్రీనివాస్ యాదవ్, కాలనీవాసులు వెంకటేశ్వర్ రెడ్డి, రవి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆయన సన్మానించారు.