జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోతారం, అంబారిపేట, తండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. దీంతో ఇటీవల కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
previous post