ప్రముఖ గేయ రచయిత, గాయకుడు అమ్మ పాట తిరుపతి ఇటీవలే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పరామర్శించారు.
అమ్మ పాట తిరుపతి ములుగు మండలం పత్తిపల్లి గ్రామానికి చెందిన వారు. తస్లీమా సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
తస్లీమా వెంట సర్వర్ ఫౌండేషన్ సభ్యులు బొచ్చు సమ్మయ్య, మామిడి పెల్లి రమేష్, హరికృష్ణ తదితరులు ఉన్నారు.