40.2 C
Hyderabad
April 29, 2024 17: 14 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి జ‌లాభిషేకం

water anointing for sri sudarshan chakra

యాదాద్రిలో మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం నేత్ర‌ప‌ర్వంగా కొన‌సాగింది.  దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ దంపతులతో కలసి మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు  ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి,  ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు.  వారికి కంక‌ణ‌ధార‌ణ చేసి పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. 7 గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. రాజ గోపురాల‌పై స్వ‌ర్ణ క‌ల‌శాల‌కు 92 మంది రుత్వికుల‌తో సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. విమాన గోపురాల శిఖ‌రాల‌పై క‌ల‌శ సంప్రోక్ష‌ణ కైంక‌ర్యాలు నిర్వ‌హించారు.

మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం త‌ర్వాత ప్ర‌ధానాల‌య ప్ర‌వేశ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. తొలుత ఉపాల‌యాల్లోని ప్ర‌తిష్ఠామూర్తుల‌కు మ‌హాప్రాణ‌న్యాసం చేశారు. తొలి ఆరాధ‌న సంప్రోక్ష‌ణ త‌ర్వాత గ‌ర్భాల‌యంలో స్వ‌యంభువుల ద‌ర్శ‌నం ప్రారంభం అయింది.  సంప్రోక్ష‌ణ త‌ర్వాత గ‌ర్భాల‌యంలో ప్ర‌థ‌మారాధ‌న‌, ఆర‌గింపు చేప‌ట్టారు. గ‌ర్భాల‌యంలో తీర్థ‌, ప్ర‌సాద గోష్ఠి నిర్వ‌హించారు.

Related posts

శ్రీకాకుళం జిల్లా పాఠశాల ఎఫ్.జి.ఎఫ్ కార్యదర్శిగా వెంకటరమణ

Satyam NEWS

రాజంపేట ఎమ్మెల్యే మేడా ఆలయ పర్యటన పై వివాదం…

Satyam NEWS

5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు

Murali Krishna

Leave a Comment