దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర భారత అమృత్ మహోత్సవాల ఏర్పాట్ల పై ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు జిల్లా రెవిన్యూ అధికారి రమాదేవి సమీక్షా సమావేశం నిర్వహించారు.
75@ స్వాతంత్ర భారత్ అమృత్ మహోత్సవాల సందర్భంగా జిల్లా లో కవి సమ్మేళనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పద్యం, గేయ సంపుటి, వచనం 15 పoక్తులు మించకుండా “75 స్వతంత్ర భారత్ అమృత్ మహోత్సవాలు” అనే క్యాప్షన్ పైన రాసి జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి ఈ నెల 28 సాయంత్రం 5 గంటల లోపు పంపాలని కోరారు.
కవి చిరునామా, పుట్టిన తేది తో సహా పూర్తి వివరాలు కూడా పంపాల్సి ఉంటుంది. సమీక్షా సమావేశంలో ములుగు జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, జిల్లా పౌర సంబంధాల అధికారి ప్రేమలత, ములుగు తహశీల్దార్ సత్యనారాయణ స్వామి, కలెక్టరేట్ a.o శ్యామ్ కుమార్, dao శ్రీనివాస్, శ్రీనివాస చారి, ఆసనాల శ్రీనివాస్ పాల్గొన్నారు.