తండ్రి మారుతీరావు అనుమానాస్పద మరణం తర్వాత ఇప్పుడు మిర్యాలగూడాకు చెందిన అమృత తన బాబాయ్ ని టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నది. తన తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అమృత చెబుతున్నది.
కొంత కాలంగా తన తండ్రి మారుతీరావుకు బాబాయ్ శ్రవణ్ కు ఆస్తి గొడవలు జరుగుతున్నాయని ఆమె చెబుతున్నది. తన భర్త హత్య కు ఇచ్చిన సుపారీ విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయని అమృత చెప్పింది. డబ్బుల విషయంలో సుఫారీ గ్యాంగ్ బెదిరింపులు కూడా మారుతీరావు ఆత్మహత్యకు ఒక కారణం కావొచ్చునని అమృత చెప్పింది.
ఆస్తి గొడవలకు సంబంధించిన తన బాబాయి శ్రవణ్ తన తండ్రి మారుతీరావుపై చెయ్యి కూడా చేసుకున్నాడని ఆమె అంటున్నది. మారుతీరావు కోరుకున్నట్లు తాను తన తల్లి దగ్గరకు వెళ్లలేనని ఆమె చెప్పింది. తనకు తన అత్త మామలు ముఖ్యమని వివరించింది.