39.2 C
Hyderabad
April 28, 2024 13: 56 PM
Slider ఆదిలాబాద్

సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారు

nirmal police

పోలీసులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన ఆర్జీ దారుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో పోలీసు స్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలని ఆయన కోరారు.

అనుమాస్పదన వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని దృష్టికి వస్తే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేయాలి లేదా జిల్లా వాట్సప్ నెం.8333986939కు సమాచారం తెలియజేయాలని కోరారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారని భరోసా ఇచ్చారు.

Related posts

శాప్ నెట్ చైర్మన్ గా బాచిన కృష్ణ చైతన్య బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

కేసీఆర్ కుటుంబ పాలన కు చరమగీతం పాడాలి

Satyam NEWS

విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment