ఆంధ్రప్రదేశ్ లో పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నిన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అయ్యారు.
అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్ గా నాగలక్ష్మి నియమితులయ్యారు. గంధం చంద్రుడు ను గ్రామ సచివాలయ డైరెక్టర్ గా నియమించారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ బదిలీ అయ్యారు.
ఆయనను మైనారిటీ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ను బదిలీ చేసి కృష్ణా జిల్లా కలెక్టర్గా నియమించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఎల్ఎస్ బాలాజీరావును నియమించారు.