తనపై గత కొన్నేళ్ళుగా 139 మంది ఐదు వేల సార్లు అత్యాచారం చేశారని మిర్యాలగూడ కు చెందిన ఓ 25సంవత్సరాల యువతి చేసిన ఫిర్యాదు మేరకు యాంకర్ ప్రదీప్ మాచిరాజుపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.
ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించిన యువతి చేసిన ఫిర్యాదు ఇప్పుడు పోలీసులకు ఓ పెద్ద సవాల్ గా మారింది.
యువతి ఇచ్చిన ఫిర్యాదులో యాంకర్ ప్రదిప్ తో పాటు ఓ ప్రముఖ టివి ఛానల్ రిపోర్టర్, సినీ నిర్మాతలు, ప్రముఖ కెమెరా మెన్, ఓ మాజి ఎంపి, ఆయన పీఎ తో పాటు ఓ డాక్టర్ కూడా ఉన్నారు.
SFI సంస్థకు చెందిన అనేక మంది విద్యా ర్ధి నాయకుల పై కూడా ఆ యువతి ఫిర్యాదు చేసింది.