సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ అమరవరం గ్రామంలో ఆదివారం ఆంధ్రజ్యోతి రిపోర్టర్,సాహితీ రత్న బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత కోలా నాగేశ్వరరావును జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ఆధ్వర్యంలో శాలువ,పూల బొకేతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారని,ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా పని చేసి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని అన్నారు.సామాజిక,రాజకీయ అంశాలతో పాటు సాహిత్య రంగంలో కోల నాగేశ్వరరావు చేస్తున్న సేవలు ఎంతో గుర్తింపు ఇచ్చాయని అన్నారు.సమాజంలో జర్నలిస్టులకు ఎంతో గౌరవం,గుర్తింపు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి,కామిశెట్టి వేంకటేశ్వర్లు,వీరాంజనేయులు, వెంకటరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్