30.7 C
Hyderabad
April 29, 2024 05: 14 AM
Slider హైదరాబాద్

నెహ్రూ యువ కేంద్రం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

#red cross

నెహ్రూ యువకేంద్రం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ సమిష్టి ఆధ్వర్యంలో స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు మాసబ్ ట్యాంక్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని KVIC మెంబర్, మాజీ వైస్ చైర్మన్ నెహ్రూ యువ కేంద్ర సంగతం పేరాల శేఖర్ రావు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలలో యువజన సంఘాలు, మహిళా మండళ్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సంఘ సేవ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, కోవిడ్-19 పై అవగాహన, రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించాలని అన్నారు.

33 జిల్లాలలో 75 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. నెహ్రూ యువకేంద్ర సంగతం, తెలంగాణ స్టేట్ డైరెక్టర్ అన్షుమాన్ ప్రసాద్ దాస్, హైదరాబాద్ నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఖష్బూ గుప్త మొదటగా రక్తదానం చేశారు.

కార్యక్రమంలో హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఎం. భీం రెండ్డి, సెక్రటరీ పార్వతి, ఉస్మానియా యూనివర్సిటీ డీన్ బాలకిషన్, డాక్టర్ జయలక్ష్మి, సినీ యాక్టర్ శ్రీతేజ, నెహ్రూ యువకేంద్ర ప్రోగ్రామ్ సూపర్ వైజర్ వీ. చంద్రశేఖర్,  జాతీయ సేవా వాలంటీర్స్, జిల్లాలోని యువతీ యువకులు పాల్గొన్నారు.

డాక్టర్. భీం రెడ్డి ఛైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో 75 రక్తదాన శిబిరాలు ఈ సంవత్సరం నిర్వహించి, రక్తదానం మహాదానం అని నిరూపిస్తాం అని అన్నారు. పార్వతి, వి. చంద్రశేఖర్ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 32 మంది  రక్తదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు.

Related posts

అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

దళితులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి వీడాలి

Satyam NEWS

మ‌రింత వినోదాత్మ‌కంగా TATA IPL 2023

Satyam NEWS

Leave a Comment