ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఆరాధ్య దేవత శ్రీశ్రీశ్రీ పైడతల్లి అమ్మవారి జాతర సందర్భంగా జరగనున్న సిరిమాను సంబరానికి అంకురార్పణ జరిగింది. జిల్లా కేంద్రానికి సమీపంలో డెంకాడ మండలం చందకపేట సిరిమల్లెచెట్టు ను గుర్తించడంతో శాస్త్రోక్తంగా జిల్లా కలెక్టర్ సూర్య కుమారి చింతచెట్టుకు పూజలు చేసారు.
వంశపారంపర్యంగా ఆలయ పూజారి బైరాగి నాయుడు సమక్షంలో జిల్లా కలెక్టర్ పూజలు చేసారు. అంతకుముందు ఆర్డీవో భవానీ శంకర్.. కుటుంబ సమేతంగా సిరిమాను చెట్టు ను సందర్శించుకుని నమస్కరించారు.ఆలాగే మేయర్ వీ.వీజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, డీఎఫ్ఓ వెంకటేష్, ఇలా జిల్లా అధికారులకు ఆలయ ఈఓ కిషోర్ కుమార్ స్వాగతం పలికారు.