గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డబుల్ ఇళ్ళ దరఖాస్తు దారులు ఇంటి అడ్రస్ మారి సవరణ చేసుకోవాలనుకునే వారు వెంటనే సర్కిల్ కార్యాలయం ను సంప్రదించాలి. జీహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంత మంది అడ్రస్ మార్పు కారణంగా జి హెచ్ ఎం సి సిబ్బంది వారి వివరాలను సేకరించ లేక పోయారు. ఇప్పటి వరకు జి హెచ్ ఎం సి సిబ్బంది దరఖాస్తు దారుల వివరాలను నమోదు చేయని వారు ఎవ్వరైనా ఉంటే తమ సమీపంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయానికి ఓటరు గుర్తింపు కార్డు తో వెళ్లి సవరించుకోవాలని జిహెచ్ఎంసి తెలిపింది. గతంలో మీ-సేవ, కలెక్టర్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని సేకరించేందుకు జిహెచ్ఎంసికి అప్పజెప్పారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి