39.2 C
Hyderabad
April 28, 2024 11: 31 AM
Slider జాతీయం

ముంబయిలో విదేశీ కరెన్సీ పట్టివేత..

ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ముంబయి నుంచి దుబాయ్ వెళ్తున్న ముగ్గురు భారతీయుల నుంచి 4,97,000 డాలర్ల (సుమారు 4.1 కోట్ల రూపాయలు) నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అడ్డగించింది. అనుమానంతో వారి బ్యాగ్లను పరిశీలించగా భారీ మొత్తంలో నగదు దొరికింది. వారు బ్యాగ్లో, చెప్పులు, చీరల్లో ఈ నగదును దాచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 4,97,000 డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి స్థానిక కోర్టు తరలించారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Related posts

చేనేతకు చేయూత కేసిఆర్ ఘనతే

Murali Krishna

కెమికల్ పాలు తయారు చేస్తున్న పవిత్ర డైరీ

Satyam NEWS

గద్దరన్నకు నివాళి..

Satyam NEWS

Leave a Comment