29.7 C
Hyderabad
May 2, 2024 06: 33 AM
Slider ముఖ్యంశాలు

వదల బొమ్మాళీ నిన్నొదల: ఈటల నెత్తిన మరో పిడుగు

#etala

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేలా లేదు. ఈటెల రాజేందర్ కుటుంబం మరో భూ కబ్జా కు పాల్పడిందని మరో ఫిర్యాదు అందింది.

దాంతో ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు దానిపై విచారణకు ఆదేశించారు.

ఈటెల రాజేందర్  కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కెసిఆర్ కు ఫిర్యాదు తో కూడిన దరఖాస్తు చేశారు.

తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కెసిఆర్ ఆదేశించారు.

ఈ మేరకు ఎసిబి విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు  సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు.

Related posts

సీనియర్ అధికార ప్రతినిధులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులూ మనుషులే.. అంటూ కరోనా సమయంలో సాయం…!

Satyam NEWS

ఏలూరు ఘ‌ట‌న‌పై హైప‌వ‌ర్ క‌మిటీ ఏర్పాటు

Sub Editor

Leave a Comment