36.2 C
Hyderabad
May 8, 2024 18: 26 PM
Slider పశ్చిమగోదావరి

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు

#polavaram project

పోలవరం కుడికాలువ గట్టు మట్టి అక్రమ తవ్వకం కేసు ఏమైందో అర్ధం కావడం లేదు.

పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామం లో పోలవరం కుడికాలువ గట్టు మట్టిని ఇటీవల జె సి బి తో తవ్వి ట్రాక్టర్ ల పై తరలించారు.

ఈ విషయం తెలుసుకుని సంబంధిత పోలవరం కాలువ ఇంజనీర్లు కొప్పులవారిగూడెం చేరుకుని జె సి బి ని, మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ లను అడ్డుకున్నారు.

ఈ సంఘటనపై కేసులు నమోదు చేశారో లేదో స్పష్టం కాలేదు కానీ ఆ తరువాత ఆ ఊసే మరిచిపోయినట్టున్నారని గ్రామస్తులు అనుకుంటున్నారు.

మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై ఇంజనీర్ల మౌనం ఎందుకు వహించారనే అంశంపై స్థానిక ప్రజలు పలు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పోలవరం కుడి కాలువ గట్టు మట్టి అక్రమ తవ్వకంపై జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లాయని తెలిసింది.

అయితే ఉన్నతాధికారులు కూడా సైలెంటుగా ఉండటం పై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related posts

ఏడేళ్లలో ఎప్పుడు లేదు…కొత్తగా ఈ బోర్డు ఏమిటి?

Satyam NEWS

పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు కూడ శ్రద్ధ చూపాలి

Satyam NEWS

ఎస్వీ ఓరియంట‌ల్ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Bhavani

Leave a Comment