విద్యల నగరమైన విజయనగరాన్ని దొంగలు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నగరంలోని దాసన్నపేటలో తెల్లవారుజామున జరిగిన దోపిడి మర్చిపోక ముందే మరో దొంగతనం జరిగింది.
దాసన్నపేట చోరీలో వెపన్ ఉపయోగించి వృద్దురాలి తలపగలగొట్టి దొంగతనానికి పాల్పడితే..తాజాగా జరిగిన దొంగతనం…ముందుగా రెక్కీ వేసి చేసినట్టు పోలీసులు అనుమానస్తున్నారు.
విజయనగరం సి బి కాలనీ… ప్లాట్ 55లో 10 తులాలు అపహరించారు..దొంగలు. రెండు రోజుల క్రితం..అపార్ట్మెంట్ లో ఉంటున్న ఈశ్వర్ రెడ్డి విజయవాడ వెళ్లి తిరిగొచ్చారు.
ఊరెళ్లి వచ్చిన ఈశ్వర్ రెడ్డి ఇంటిని పరిశీలించి చూడ…బెడ్ రూమ్ లో కిటికీ గ్రిల్ ను తీసేసినట్టు కనిపించింది. అనుమానం వచ్చి ఇల్లంతా చూడటంతో…వంటిల్లు సోదాలు చేసి ఉన్నట్టు గుర్తించారు.
అలాగే గదిలో ఉన్న బీరువాలో 10 తులాలు అపహరించినట్టు గుర్తించారు.వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఫిర్యాదు అందుకున్న వన్ టౌన్ ఎస్ఐ దేవి..సీఐ మురళీ ఆదేశాలతో ఘటనా స్థలికి చేరుకుని ఫింగర్ ఫ్రింట్స్ సేకరించారు.
అయితే అప్పటికే ఇంటిలో ఉంటున్న వాళ్ల వేలిముద్రలు ఉండటం పోలీసులకు దర్యాప్తు జఠిలంగానే కనిపిస్తొంది.
తన ఇంట్లో.. 8 తులాల బంగారు నగలు చోరీ గురైనట్లు మేడపాటి ఈశ్వర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ దేవీ తెలిపారు.
దాసన్నపేట చోరీ కేసును చేధించేందుకు సెంట్రల్ క్రైమ్ పోలీసులు జుట్టు పీక్కుంటున్న తరుణంలోనే మరో చోరీ జరగడం గమనార్హం.