అచ్చంపేట మండలం ఉప్పరిపల్లి గ్రామంలో ఇటివలి 20 రోజుల క్రితం హైదరాబాద్ నుండి గ్రామానికి వచ్చిన వ్యక్తి జ్వరం రావటంతో టెస్ట్ లకు పంపించగా పాజిటివ్ గా నిర్దారణ అయిందని డిఎంహెచ్ఓ తెలిపారు. పెంట్లవెల్లి మండలం కోండూరు గ్రామంలో ప్రైమరి కాంటాక్ట్ లో బాగంగా స్యాంపిల్ టెస్ట్ కు పంపించగా పది సంవత్సరాల బాలుడికి కరోనా నిర్దారణ అయిందని తెలిపారు.
నాగర్ కర్నూల్ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనికి చెందిన నాగర్ కర్నూల్ మున్సిపాలిటి ఉద్యోగికి కరోనా నిర్దారణ అయిందని డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులకు సంబందించి ప్రైమరి కాంటాక్ట్ లను గుర్తిస్తున్నట్లు తెలిపారు