మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం లేదా ప్రపంచ మాదకద్రవ్యాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 26న సిబిఐటి క్యాంపస్లో నిర్వహించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం లేని ప్రపంచాన్ని సాధించడంలో విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం-2023 కోసం ఐక్యరాజ్యసమితి “ప్రజలు ముందు: కళంకం మరియు వివక్షను ఆపండి, నివారణను బలోపేతం చేయండి” అనే అంశాన్ని ఎంపిక చేసింది.
చైతన్య స్వాస్థ్య – వెల్నెస్ క్లబ్ ఆఫ్ సిబిఐటి క్యాంపస్లో “సే యెస్ టు లైఫ్ అండ్ నో టు వీడ్”, “సే నో టు డ్రగ్స్” అనే నినాదాలతో ర్యాలీని నిర్వహించింది.ఈ ర్యాలీని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే చాల సంక్లిష్ట సమస్య.
మాదకద్రవ్యాలను ఉపయోగించే చాలా మంది వ్యక్తులు కళంకం, వివక్షను ఎదుర్కుంటారు. ఇది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మరింత హాని కలిగించవచ్చు. వారికి అవసరమైన సహాయాన్ని మనము అందించాలి. విద్యార్థులు ఈ మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉండాలి అని సుచించారు.
ఈ సందర్భంగా విద్యార్థి వ్యవహారాలు, విద్యార్థి ప్రగతి విభాగం డైరెక్టర్ డాక్టర్ పి.వి.ఆర్. రవీంద్రారెడ్డి, ప్రొఫెసర్. కె.జగన్నాథరావు, ఎన్.ఎల్.ఎన్.రెడ్డి. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.ఎన్.ఆర్.ప్రసాద్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ చైతన్య స్వాస్థ్య క్లబ్ డా.పి.వి.నాగ ప్రపూర్ణ, ఫ్యాకల్టీ మెంబర్ చైతన్య స్వాస్థ్య క్లబ్ డా.ఆర్.ప్రసన్న రాణి విద్యార్థిలు మృదుల్ రెడ్డి, సుఫియాన్ అహ్మద్, సహస్ర, లక్ష్మీ ప్రసన్న సమన్వయం చేశారు.