27.7 C
Hyderabad
May 4, 2024 08: 38 AM
Slider ముఖ్యంశాలు

కేరళలో ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

#kerala

కేరళలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన అయ్యప్ప స్వామి భక్తులతో శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పత్తనంథిట్ట జిల్లా లాహల్యాంప్ బోటు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది భక్తులకు గాయాలయ్యాయి.వారిలో ఓ చిన్నారి సహా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.తీవ్రంగా గాయపడిన వారిని పతనంథిట్ట జనరల్ ఆసుపత్రిలో చేర్చగా మిగిలిన వారిని రాణి పెరునాడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.బస్సు బ్రేక్ డౌన్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గాయపడిన వారిని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఏపీ అధికారులు కూడా ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

Related posts

సిఎం సొంత జిల్లాలో అధ్వాన్నంగా రహదారులు

Satyam NEWS

ఎంపీ ధర్మపురి అరవింద్ పైన దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి

Satyam NEWS

గోదావరిలో మునిగిపోయిన ఏపి పర్యాటక రంగం

Satyam NEWS

Leave a Comment