29.7 C
Hyderabad
May 6, 2024 06: 59 AM
Slider ప్రత్యేకం

ఆసుపత్రికి తీసుకెళ్లమంటే కిడ్నీ అమ్మేశాడు

#odisha

నలతగా ఉందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని భార్య అడిగితే, ఇదే అవకాశం అనుకున్నాడేెమో భార్యకు తెలియకుండా ఆమె కిడ్నీ అమ్మేశాడు ఓ ప్రబుద్ధుడు. విస్మయం కలిగించిన ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని  మల్కాన్‌గిరి జిల్లాలో జరిగింది.  కొంతకాలం క్రితం  మల్కాన్‌గిరి సమితి కథామేట గ్రామానికి చెందిన రంజిత కుండు తనకు నలతగా ఉందని భర్త ప్రశాంత కుండుకు చెప్పింది. ఆయన భార్యను భువనేశ్వర్‌ తీసుకెళ్లి ఒక ఆసుపత్రిలో కిడ్నీ తీయించి అమ్మేశాడు. ఆ సమయంలో చేయాల్సిన సంతకాల కోసం రంజిత తండ్రిగా మల్కాన్‌గిరి జిల్లా కలిమెల ఠాణా ఎమ్‌.వి. 70 గ్రామానికి చెందిన సుబల్‌ మాఝిని  కొంత డబ్బు ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటికి  రంజిత ఎవరికీ చెప్పలేదు.  ఇటీవల ప్రశాంత వేరే మహిళతో తిరుగుతుండడంతో రంజితా మల్కాన్‌గిరి ఠాణాలో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన ఠాణా అధికారి రిగాన్‌ కిండో సుబల్‌ మాఝిని అరెస్టు చేశారు. విచారణలో కిడ్నీ విషయo వెలుగులోకి రావటంతో అవాక్కయ్యారు.  ప్రశాంత పరారీలో ఉన్నట్లు పోలీసులు  చెప్పారు.

Related posts

ఆర్థిక సహాయం కావాలి: గుండె బాధితుని కుటుంబం వేడుకోలు

Satyam NEWS

యూపీ ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్

Sub Editor

చిత్తూరు నియోజకవర్గ తెదేపాకు దిక్కెవరు?

Satyam NEWS

Leave a Comment