రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థ లలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కారం కోరుతూ ఈ నెల 25 వ తేదీన బంద్ కు పిలుపు నిచ్చినట్లు…ఏఐఎస్ఎఫ్ స్పష్టం చేసింది. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం సంఘం నేతలు మీడియా మాట్లాడుతూ…
జిల్లా లో విద్యారంగంలో అన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయ్యిందన్నారు.బొబ్బిలి లో ప్రభుత్వ కళాశాల, విజయనగరం లో పెండింగ్ కళాశాల… అలాగే రాజాం లో ఐటీఐ…లు…ఏర్పాటు కాకుండా పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. జిల్లా లో విద్యశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న….
విద్యారంగంపై…చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నించారు. గడచిన రెండు, మూడు రోజుల గా జిల్లా లో విద్యా సమస్యలు ఉత్పన్నం అవుతున్న… పట్టించుకోవటం జరగలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో… విద్యా రంగం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ నేత నాగభూషణం తెలిపారు.