33.7 C
Hyderabad
April 29, 2024 00: 37 AM
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

#revanthreddy

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబావి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలకు చెందిన  పలువురు బీఆర్ఎస్ నాయకులు నేడు కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో హైదరాబాదులో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి వారిని సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో చిన్నంబాయి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిదంబర్ రెడ్డి, బెక్కెం సింగిల్ విండో డైరెక్టర్ వెంకట స్వామి, వీపనగండ్ల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య, పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి గ్రామ సర్పంచ్ భర్త కొండల్ రావు, చిన్నకార్పముల టీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి తో పాటు దాదాపు ఆయా మండల గ్రామాలకు చెందిన 50 మందికి పైగా చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అరాచకత్వం రాజ్యమేలుతుందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తూ పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మల్లురవి, రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు, పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్ మాచూపల్లి బాలస్వామి, చిన్నంబావి మండల సింగిల్ విండో వైస్ చైర్మన్ విద్యాసాగర్ రావు, ప్రస్తుత మరియు మాజీ ప్రజా ప్రతినిధులు నియోజకవర్గ నాయకులు తదితరులు ఉన్నారు.

Related posts

తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం

Satyam NEWS

పాఠశాలల పున:ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఇవే

Satyam NEWS

నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన IKR ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment