రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులను కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. జనసేన కార్యాలయంలో రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి మల్లిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం దళితుల పై వైసీపీ చేస్తున్న దాడులకు నిరసన తెలియజేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో దళితులకు నేరవేర్చలేని అసాధ్యమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. అంబేద్కర్ విగ్రహాలను పెట్టడమే కాదు వారి ఆశయాలను కూడా నెరవేర్చాలన్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా దళితుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఇష్టం వచ్చినట్టు దూషించడం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తునారన్నారు.
అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రెవిన్యూ లోటు లోకి వెళ్ళిపోయిందని, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని అన్నారు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దళితుల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై ఖండిస్తూ రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు.
రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకట రమణ, ఆధ్వర్యంలో పార్లమెంట్ ఇన్చార్జ్ సయ్యద్ ముకర్రం చాన్, ఎంపీ అభ్యర్థి లీగల్ సెల్ జనసేన పార్టీ కత్తి సుబ్బారావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పవన్ బాబు, జనసేన పార్టీ రాజంపేట నాయకులు బండ్ల రాజేష్ , కే సుబ్రహ్మణ్యం, పి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని దళితుల మీద జరుగుతున్న దాడులను జనసేన పార్టీ తరఫున ఖండించారు.