వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఏపీఎం ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన చోటచేసుకుంది. కొత్తగూడ మండలం ఇందిరా క్రాంతి పథం లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న పలకల రఘోత్తం రెడ్డి ఇంట్లో ఉరి వేసుకోగా, స్థానికులు గమనించి కిందకు దింపి వైద్యునితో పరీక్షలు చేయించగా మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం.ఈ విషయం తెలుసుకున్న ఎస్సై బొజ్జ రవీందర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
previous post
next post