ప్రపంచ దేశాలు మనల్ని మందులు అడిగే స్థాయికి మన ఎదిగామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కరోనా నేపథ్యంలో పెద్ద పెద్ద దేశాలు అల్లాడుతుంటే మనం అందరం కలిసి కరోనాను నిలుపుదల చేసే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యేదిశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. మన్ కి బాత్ కార్యక్రమం నుంచి ఆయన దేశ ప్రజలతో మాట్లాడుతున్నారు. భారత దేశంలో ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న వైద్య విధానాలు కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కరోనా పోరాటంలో దేశ ప్రజలు చేస్తున్న త్యాగం నిరుపమానమైనదని ఆయన అన్నారు. మన దేశం నుంచి మందులు తీసుకుంటున్న దేశాలు థాంక్యూ ఇండియా అంటూ ఉంటే గర్వంగా ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇది భారత దేశ ప్రజల విజయమని ఆయన అన్నారు.
previous post
next post