41.2 C
Hyderabad
May 4, 2024 15: 09 PM
Slider వరంగల్

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం పొందడానికి దరఖాస్తుల ఆహ్వానం

ములుగు జిల్లా రైతులు రుణాలు పొందేందుకు ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం మే ఒకటో తారీకు వరకు దరఖాస్తు చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కే లక్ష్మణ్ , డి డి ఎం టి రవి ఒక ప్రకటనలో కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక డ్రైవ్ ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారులు అందరికీ రుణ సదుపాయం కల్పించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని బ్యాంకులను ఆదేశించిందని ఈ పథకం ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారులు సంబంధిత బ్యాంకు బ్రాంచీల కు దరఖాస్తు చేసుకొని కిసాన్ క్రెడిట్ కార్డులు పొందాలని బ్యాంకు అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసి రుణం మంజూరు చేస్తారని తెలిపారు.

ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పొందేందుకు భూమి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ తో పంట వివరాలతో సంబంధిత బ్యాంకు లో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల్లో క్రెడిట్ కార్డులు అందజేస్తారు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకుల అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డుల అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రాజెక్టు యొక్క బ్యాంకు అధికారులు కలిసి పీఎం కిసాన్ లబ్ధిదారులు అందరికీ అవగాహన కల్పిస్తారు అని అన్నారు.

ఈ పథకం ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మూడు లక్షల రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా కార్డు ద్వారా రుణం అందిస్తారని తెలిపారు కార్డు ద్వారా మాత్రమే కాకుండా గొర్రెలు మేకల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల బాతుల పెంపకం, కొరకు కూడా రుణ సదుపాయం బ్యాంకుల ద్వారా కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇతర వివరాలకు సంబంధిత తమ బ్యాంకు బ్రాంచీలు సంప్రదించాలని సూచించారు.

Related posts

సీఎం కేసీఆర్ భేటీ!!!

Sub Editor

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని వచ్చేసిందోచ్

Satyam NEWS

యువతా…డ్రగ్స్ కు ఎడిక్ట్ అవ్వొద్దు…!

Bhavani

Leave a Comment