వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న క్రైస్తవ అభ్యర్థుల, సంస్థల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు ములుగు జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఎన్. జెశ్రన్ కుమార్ తెలిపారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే క్రిస్మన్ వేడుకల కార్యక్రమంలో ఎంపిక చేయబడిన అర్హులయిన క్రైస్తవ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వముచే గౌరవ సత్కారం పొందవచ్చునని తెలిపారు. దీనికోసం అర్హులయిన క్రైస్తవ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సామాజిక సేవారంగం, విశిష్టమైన వైద్య సేవలు, విద్యాబోధన, సాహిత్యం, కళలు, మరియు క్రీడా రంగాలలో 10 సంవత్సరాల పైబడి విశేషమయిన సేవలు అందించిన క్రైస్తవులు మరియు విద్య, సామాజిక సేవా రంగాలలో 30 సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నవారు అర్హులని ఆయన తెలిపారు. నామినేషన్లు www.tscmfc.in అంతర్జాలంలో గాని లేదా జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి, ములుగు జిల్లా కార్యాలయము నందు గాని పొందవచ్చును. జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి కార్యాలయం రూం.నెం 6, సంక్షేమ భవన్, ములుగు.సంప్రదించు ఫోన్ నెంబర్ 9989661146.
previous post