29.7 C
Hyderabad
May 4, 2024 04: 52 AM
Slider కర్నూలు

ఆళ్లగడ్డలో జర్నలిస్టులపై దాడి అమానుషం

#AllagaddaJournalists

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండల విలేకరుల పై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది.

రెండు రోజుల క్రితం దొర్నిపాడు మండలానికి చెందిన ఇద్దరు పాత్రికేయులపై దుండగుడు కారుతో గుద్ది హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేశవుని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు జయ ప్రకాష్ వైద్యులను కోరారు.

ఆయనతో బాటు నంద్యాల APUWJ కమిటీ సహాయ కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షులు ప్రదీప్, విజయ్ బాబు, యూనియన్ సభ్యులు పవన్ కళ్యాణ్, రఘునాధ్ రెడ్డి ఉన్నారు.

విలేకరులపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడి పై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కోరారు.

Related posts

మానసిక వికాసానికి  క్రీడలు ఎంతో అవసరం

Satyam NEWS

అమావాస్య అన్నదానం ఎంతో పుణ్యం

Satyam NEWS

శెనగల ఝాన్సీ రాణి కి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం

Satyam NEWS

Leave a Comment