26.7 C
Hyderabad
May 15, 2024 08: 39 AM
Slider విజయనగరం

సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం నిర్వ‌హ‌ణ‌

Soldiers

ఏపీలోని విజయనగరం జిల్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావం ప్రదర్శిస్తూ.. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని సైనికుల సేవలు, త్యాగాలు మరువలేనివని అన్నారు. సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో జరిగిన సత్కార సభలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, సైనిక కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికుల సేవలు వెలకట్టలేనివని.. వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. సైనికులు, వారు కుటుంబ సభ్యుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి విరాళాలు అందజేయటం ద్వారా వారి రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్బిఐ బ్యాంకు విశ్రాంత మేనేజర్ పరిటి శంకర సూర్యారావు లక్ష, ఎక్స్ సర్వీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరడ అప్పారావు 25 వేలు సైనిక సంక్షేమ నిధికి అందజేశారు. వీరిని కలెక్టర్ శాలువాలు క‌ప్పి సత్కరించారు. జిల్లాలో ఉన్న ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, పౌరులు స్పందించి సైనిక సంక్షేమ నిధికి విరివిగా విరాళాలు అందజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, సైనిక సంక్షేమ సంఘం మాజీ సభ్యులు దేవర ఈశ్వరరావు, బొడ్డేపల్లి రామకృష్ణారావు, కూసుమంచి సుబ్బారావు, సామాజిక కార్యకర్త అబ్దుల్ రవూఫ్, మాజీ సైనికులు, సైనిక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణారావుకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు

ఇప్పటివరకు 157 సార్లు రక్తదానం చేసిన ఎక్స్ – సార్జెంట్ (ఎయిర్ ఫోర్స్), ఉపాధ్యాయుడు అయిన బొడ్డేపల్లి రామకృష్ణారావును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా వేసి సత్కరించారు. రామకృష్ణారావును అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

Related posts

అఖిల్ అక్కినేని తో రొమాన్స్ చేస్తున్న పూజా హెగ్డే

Satyam NEWS

సీఎంను కలసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు

Bhavani

ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ కి దాసరి ప్రతిభా పురస్కారం

Satyam NEWS

Leave a Comment