42.2 C
Hyderabad
May 3, 2024 17: 22 PM
Slider విజయనగరం

ఎంఎల్సీ ఎన్నికలకు జేడ్పీ హెచ్ సీ పోలింగ్ కేంద్రంపై పోలీసు బాస్ దృష్టి

#mlcelections

వచ్చే నెల మార్చి 15న ఏపీలో ఎంఎల్సీ ఎన్నికలు జరగనున్న. సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పోలింగ్ జరగనున్న కేంద్రాలపై  రాష్ట్ర డీజీపీ ఆదేశాలు… విశాఖ రేంజ్ డీఐజీ  సూచనలతో జిల్లా ఎస్పీ  దీపికా దృష్టి పెట్టారు.అందులో భాగంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎస్పీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక జామి   జేడ్పీ హెచ్. సీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంను సందర్శించారు.,భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అంతకు ముందు విజయనగరం సబ్ డివిజన్ లో ఉన్న జామి పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ దీపికా ఆకస్మికంగా వెళ్లి… తనిఖీ చేశారు. స్టేషన్ లో  రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు. సీసీటీఎన్ఎస్ లో   అప్లోడ్ చెయ్యాలని సిబ్బంది ని ఆదేశించారు. కొద్ది రోజుల్లో జరగనున్న అమ్మవారి పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జామి ఎస్ఐ వీరబాబు వివిధ కేసుల్లో సాధించిన ప్రగతిని జిల్లా ఎస్పీకి వివరించారు.ఈ పర్యటన  జామి ఎస్ఐ వీరబాబు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

నెగ్లిజెన్సీ:పుట్టుకతోనే ముఖం ఫై కత్తిగాటుతో పుట్టేసింది

Satyam NEWS

బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడుతున్న కోమటిరెడ్డి

Satyam NEWS

తిరుమల-మెడికోవర్ సహాయంతో పోలీసులకు ఉచిత వైద్య పరీక్ష

Satyam NEWS

Leave a Comment